- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : వారాయి గూడెం గ్రామంలో 518 సర్వేనెంబర్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు నిరసన చేపట్టారు. గురువారం భువనగిరి మండలం రాయగిరి గ్రామంలో భూభారతిపై రెవిన్యూ సదస్సులో భాగంగా రైతులకు అవగాహన నిర్వహించగా, వారు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తాసిల్దార్ అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని అన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ..రైతులకు ఇంతవరకు రైతుబంధు ఇవ్వడం లేదనీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రైతుల కష్టాలు మారవా అని అధికారులను నిలదీసే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో వడాయిగూడెం గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
- Advertisement -