Saturday, June 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను అందించాలి...

ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను అందించాలి…

- Advertisement -

నవతెలంగాణ – ధర్మసాగర్
విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను అందించాలని ఎంపీడీవో అనిల్ కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల లోని డాక్టర్ అబ్దుల్ కలాం టీచింగ్ లర్నింగ్ సెంటర్ భవనంలో బడిబాట సన్నాహక సమావేశం మండల విద్యాధికారి డాక్టర్ రామ్ధన్ అధ్యక్షతన నిర్వహించారు. ఇన్చార్జి ధర్మ ప్రకాష్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి, అనిల్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం ముద్రించిన పాంప్లెట్స్ ను ఆవిష్కరించి మాట్లాడారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న మెరుగైన సదుపాయాల దృష్ట్యా,ధర్మసాగర్ మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లల్ని చేర్పించాలని అన్నారు. అనంతరం పరిశీలకులుగా హాజరైన కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ బద్దం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాశాఖ జూన్ 6 నుండి 19 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు నమోదు పెంచేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బడిబాట కార్యక్రమాన్ని అన్ని గ్రామాల విద్యాభిమానుల సహకారంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జూన్ 6 నుండి 19 వరకు ప్రతిరోజు నిర్వహించాల్సిన విద్యాసంబంధ కార్యక్రమాల గురించి డాక్టర్ రామ్ధన్ సోదాహరణంగా వివరించారు. వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాలల్లో నిర్వహిస్తున్న బెస్ట్ ప్రాక్టీస్ తెలియజేశారనీ తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రథమ ఉపాధ్యాయులు మురళి, శ్రీనివాస్, నాగేశ్వరి ,సునంద, శ్రీనివాసరెడ్డి మండలంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -