ఐసిడిఎస్ సూపర్వైజర్ మల్లీశ్వరి
నవతెలంగాణ – పాలకుర్తి
శిశువుల ఎదుగుదలకు తల్లిపాలతో పాటు పౌష్టికాహారాన్ని అందించాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ మల్లీశ్వరి అన్నారు. పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని వల్మీడీలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లీశ్వరి మాట్లాడుతూ రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు పుట్టిన వెంటనే శిశువుకు మర్రిపాలు అందించాలని సూచించారు. చిన్నారులకు 6 నెలల వరకు తల్లిపాలు తప్పనిసరిగా అందించాలని ఆరు నెలల తర్వాత తల్లిపాలతో పాటు అదనపు ఆహారాన్ని అందించాలన్నారు. అంగన్వాడి కేంద్రాల్లోనే పౌష్టికాహారం అందుతుందని తెలిపారు. ఆరోగ్య పరిరక్షణకు వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు, బాలింతలు పాల్గొన్నారు.
శిశువుల ఎదుగుదలకు పౌష్టికాహారాన్ని అందించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES