Wednesday, October 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శిశువుల ఎదుగుదలకు పౌష్టికాహారాన్ని అందించాలి 

శిశువుల ఎదుగుదలకు పౌష్టికాహారాన్ని అందించాలి 

- Advertisement -

ఐసిడిఎస్ సూపర్వైజర్ మల్లీశ్వరి 
నవతెలంగాణ – పాలకుర్తి

శిశువుల ఎదుగుదలకు తల్లిపాలతో పాటు పౌష్టికాహారాన్ని అందించాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ మల్లీశ్వరి అన్నారు. పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని వల్మీడీలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లీశ్వరి మాట్లాడుతూ రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు పుట్టిన వెంటనే శిశువుకు మర్రిపాలు అందించాలని సూచించారు. చిన్నారులకు 6 నెలల వరకు తల్లిపాలు తప్పనిసరిగా అందించాలని ఆరు నెలల తర్వాత తల్లిపాలతో పాటు అదనపు ఆహారాన్ని అందించాలన్నారు. అంగన్వాడి కేంద్రాల్లోనే పౌష్టికాహారం అందుతుందని తెలిపారు. ఆరోగ్య పరిరక్షణకు వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు, బాలింతలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -