Saturday, June 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

- Advertisement -

మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ 
నవతెలంగాణ – పెద్దవంగర
: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెరిగిందని, ప్రతి ఉపాధ్యాయుడు అంకితభావంతో విధులు నిర్వహిస్తూ, నాణ్యమైన విద్య అందించాలని మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎంఆర్సీలో బడిబాట, అకాడమిక్ కార్యక్రమాలపై అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిట్యాల కాంప్లెక్స్ హెచ్ఎం అర్రోజు విజయ్ కుమార్ తో కలిసి మాట్లాడారు. మండల పరిధిలోని అన్ని గ్రామాలు, తండాల్లో విస్తృతంగా బడిబాట కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. గతేడాది ప్రభుత్వ పాఠశాలల్లో 1433 మంది విద్యార్థులు ఉంటే, ఈ విద్యా సంవత్సరంలో ఆ సంఖ్య 1563 కు చేసిందన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సంపూర్ణ సహకారంతో ఈ విద్యా సంవత్సరంలో 130 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ పొందినట్లు తెలిపారు. ఈనెల 25 నుంచి 30 వ తేది వరకు విద్యార్థులకు బేస్ లైన్ టెస్ట్ నిర్వహించి, పరీక్ష ఫలితాలను జులై 15 లోపు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ లో నమోదు చేయాలన్నారు. ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాం సకాలంలో అందించి, వారి ఉన్నతికి కృషి చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కళాధర్, శేషవల్లి, పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -