Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి..

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి..

- Advertisement -

పాఠశాలల్లో అపరిశుభ్రతపై అసంతృప్తి, ఆగ్రహం
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం)
: విద్యార్థులకు చదువుతోపాటు,నాణ్యమైన భోజనం అందించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాటారం మండలంలోని దామెరకుంటలోగల  సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, గంగారం మోడల్ పాఠశాలలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ చేశారు. దామెరకుంట గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల  తనిఖీ సందర్భంగా పాఠశాలలో పరిశుభ్రత కరువైందని గుర్తించి కలెక్టర్  అసంతృప్తి వ్యక్తం చేశారు. డైనింగ్ హాల్ పరిశీలించి  వంట కోసం తతెచ్చిన కూరగాయలు పరిశుభ్రంగా లేకపోవడం, వంటగదిలో ఈగలు ఉండడం, వంటగది పరిసరాలు ఆపరిశుభ్రంగా ఉండటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని, ఆహార తయారీ ప్రదేశాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.విద్యార్థుల ఆరోగ్యానికి హాని కలగకూడదని, పాఠశాలలో పరిశుభ్రత, పారిశుద్య ప్రమాణాలు పాటించాలని  స్పష్టం చేశారు. తాను. మళ్ళీ తనిఖీకి వస్తానని మార్పు రాకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పరిశుభ్రత పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన  భోజనం అందించాలని వంట గది, డైనింగ్ హాల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాని హెచ్చరించారు.వానాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు అనారోగ్య బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు.   అనంతరం పాఠశాలలోని తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్ , స్టోర్ రూమ్, డార్మెటరీలను పరిశీలించి విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు.  పాఠశాలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.

కొన్ని చోట్ల భవనం పెచ్చులు ఊడుతున్నాయని విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో తరగతి గదులు సరిపోవడం లేదని ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా పాఠశాల వెనకాల నిరుపయోగంగా ఉన్న జూనియర్ కళాశాల భవనాన్నీ  పరిశీలించి మరమ్మతులు చేసి అందుబాటులోకి తేవాలని టి.ఎస్ ఈడబ్ల్యూఐడిసి ఈ.ఈ కి తక్షణమే ఫోన్ చేసి  ఆదేశించారు.అనంతరం గంగారంలోని తెలంగాణ మాడల్ పాఠశాలను సందర్శించి పాఠశాలలో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. పాఠశాల వెనుకాల గల హాస్టల్ భవనాన్ని పరిశీలించి త్వరిత గతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాల భవనం ముందు కొంత మేర మిగిలిన సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని,  పాఠశాల విద్యార్థుల కోసం వంట గది నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని ప్రధానోపాధ్యాయులు కోరగా నిధులు మంజూరు చేస్తామని హాస్టల్ భవనం లో గీజర్లతో పాటు కావలసిన మౌలిక వసతుల కల్పనకు నివేదికలు అందించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, తహసీల్దార్  నాగరాజు, ఎంపీడీవో బాబు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -