- Advertisement -
నవతెలంగాణ – మిడ్జిల్
మండలంలోని ఈదుల బాయి గ్రామపంచాయతీ తండాకు చెందిన రాత్లావత్ కుమార్ అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ ధర్మానాయక్, భాస్కర్ నాయక్ లు శుక్రవారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కుమార్ మరణం కుటుంబానికి తీరని లోటని అన్నారు. అదేవిధంగా కుమర్ కు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అనంతరం అంత్యక్రియల నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు చెరో రూ. 5 వేల చొప్పున రూ. 10 వేలు అందజేశారు. కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రవికుమార్ నాయక్, భాస్కర్ నాయక్, చక్రు నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
- Advertisement -



