- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. దీని ద్వారా దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన ‘‘ఈఓఎస్-ఎన్1’’ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపుతున్నారు. అయితే ఈ ప్రయోగంలో పలు ఇబ్బందులు ఎదురైనట్లు ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు. రాకెట్ ప్రయోగం మూడో దశ వరకు సాఫీగా సాగినట్లు తెలిపారు. ఆ తర్వాత కొంత అంతరాయం ఏర్పడినట్లు చెప్పారు. పరిస్థితిని విశ్లేషిస్తున్నట్లు వెల్లడించారు.
- Advertisement -


