- Advertisement -
నవతెలంగాణ-వనపర్తి: సెప్టెంబర్ 17న వనపర్తి జిల్లాలో ప్రజా పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 17 న ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఐడిఒసి ప్రాంగణంలో నిర్వహించనున్నమని, ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా చీఫ్ విప్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజాపాలన వేడుకల నిర్వహణ పై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
- Advertisement -