- Advertisement -
ఏర్పాట్లు పరిశీలించిన ఉన్నతాధికారులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న (బుధవారం)హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో ప్రజా పాలనా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పలువురు ఉన్నతాధికారులు ముందస్తుగా పోలీస్ అధికారులు చేపట్టే రిహార్సల్స్, ఏర్పాట్లను పరిశీలించారు. డీజీపీ డాక్టర్ జితేందర్, ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, విద్యుత్ శాఖ ఎం.డి.ముష్రఫ్ అలీ, సమాచార శాఖ కమిషనర్ సి.హెచ్.ప్రియాంక, జిల్లా కలెక్టర్ హరి చందన, ప్రోటోకాల్ జాయింట్ సెక్రెటరీ శివలింగయ్య, అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్ తదితరులున్నారు.
- Advertisement -