- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డిలో నిర్వహించిన ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతంగా చేయాలని సూచించారు. అనంతరం ఇతర శాఖల యొక్క పనులపై అలా తీసి పూర్తిచేయాలని అన్నారు. భూ సమస్యలు రెండు పడకల గదుల ఇల్లు మంజూరు, రైతు భరోసా మంజూరు, తదితర అంశాలపై అర్జీలు ఈరోజు చేపట్టిన ప్రజావాణి కార్యక్రమంలో 135 అర్జీలు పలు శాఖలకు చెందిన అందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ చందర్, కామారెడ్డి ఆర్ డి ఓ వీణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -