- Advertisement -
ఇంచార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో (సోమవారం) ఈ నెల 27న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఇంచార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం నిర్వహించే ఆడిటోరియంలో A4 మద్యం దుకాణాల టెండర్ కు సంబంధించిన లక్కీ డ్రా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు గమనించాలని ఆమె సూచించారు.
- Advertisement -


