Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి..

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి..

- Advertisement -

జిల్లా కలెక్టర్ హనుమంతరావు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని  యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన  ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి 45 అర్జీలను, జిల్లా కలెక్టర్,జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, స్థానిక సంస్థలు కలెక్టర్ భాస్కరరావుతో కలసి అర్జీలను స్వీకరించారు.

వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి జయమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృతిక, రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి,వివిధ శాఖల  జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -