- Advertisement -
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల: సోమవారం యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. గతవారం గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఎన్నికలు రద్దు అయినందున ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఈ సోమవారం తమ సమస్యలను లిఖితపూర్వకంగా ప్రజావాణి కార్యక్రమంలో సమర్పించుకోవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు.
- Advertisement -