నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు సత్వర పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి 71 అర్జీలను, జిల్లా కలెక్టర్,జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి తో కలసి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు.
అందులో రెవిన్యూ శాఖ 42, సర్వే ల్యాండ్ 7, మున్సిపాలిటీ 6,జిల్లా పంచాయతీ 3,జిల్లా సంక్షేమ శాఖ 3, జిల్లా విద్యా 2, బ్యాంకు 2, ఎస్సీ కార్పొరేషన్2, హౌసింగ్, ఆర్టీసీ, మెడికల్, పశు వైద్యం, శాఖలకు ఒక్కొకటి చొప్పున వచ్చాయని తెలియజేశారు. వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభా రాణి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి,హౌసింగ్ పి.డి విజయ సింగ్, జిల్లా పంచాయతీ అధికారి సునంద వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.