- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆర్సీబీతో జరుగుతున్న కీలక మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చేతులెత్తేసింది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి అత్యల్ప స్కోరు 101 పరుగులకే ఆలౌటైంది. అయితే ఈ కీలకమైన మ్యాచ్ లో ఒక్క బ్యాటర్ కూడా ఆశించదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. కనీసం 30 పరుగులకు మించి చేయలేక చతికిలపడ్డారు. దీంతో ఆర్సీబీ అభిమానులు స్టేడియంలో హోరెత్తించారు. ఈ సారి కప్ ఆర్సీబీదే అని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. 18 ఏండ్ల ఆర్సీబీ కళ ఈ 18వ సీజన్ లో నెరవేరుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -