- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దర్శకుడు పూరి జగన్నాథ్, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా మొదటి షెడ్యూల్ చిత్రీకరణ ఈ ఏడాది జూన్ చివరి వారంలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ చెన్నై, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో లొకేషన్ల వేటలో ఉంది. పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను ఏకకాలంలో విడుదల చేయనున్నారు.
- Advertisement -