- Advertisement -
నవతెలంగాణ-చిన్నకోడూరు
మండల పరిధిలోని మాచాపూర్ లో కొండచిలువ కలకలం రేపుతున్నాయి. గత మూడు రోజుల క్రితం కోటిలింగేశ్వర ఆలయం సమీపాన స్థానికులకు కొడచిలువ కనిపించింది. ఆదివారం సాయంత్రం సుంచు రాజవ్వ వ్యవసాయ పొలం వద్ద మరోసారి కొండచిలువను రైతులు చూసి భయాందోళన గురయ్యారు. ఈ సర్పాలు అడవి నుండి పొలాలోకి వస్తున్నాయని గ్రామ రైతులు వివరించారు.
- Advertisement -



