Saturday, June 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య 

ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య 

- Advertisement -

నవతెలంగాణ – డిండి:  ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా 2025 26 విద్యాసంవత్సరానికి సంబంధించి మొదటి రోజు  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల డిండిలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి పాపి రెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి రామారావు మాట్లాడుతూ…. ప్రభుత్వ పాఠశాలలను అన్ని వసతులతో కూడిన సొంత భవనాలలో నాణ్యమైన విద్య ఉచితంగా అందించబడుతుందన్నారు. డిండి గ్రామ ప్రజలు ప్రభుత్వ పాఠశాలలో బడి ఈడు పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమానికి గ్రామ నాయకులు ఏటీ కృష్ణ, బలుముల ప్రేమ్ కుమార్, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -