ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య..

నవతెలంగాణ – హలియా 
ప్రభుత్వ పాఠశాలలు గుణాత్మకమైన ఒత్తిడి లేని విద్యను అందించగలవని చింతగూడెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్బిరెడ్డి వేమారెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రామడుగు గ్రామంలో ఉపాధ్యాయులతో కలిసి ఇల్లిల్లు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్య కోసం కల్పిస్తున్న సదుపాయాలను గురించి తెలుపుతూ.. విద్యార్థులను పాఠశాలలో చేయవలసిందిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రామడుగు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కట్ట మధు, వెంకన్న పాఠశాల ఉపాధ్యాయులు గడ్డం శ్యాంప్రసాద్, పురం వెంకటయ్య, డాక్టర్ సాగర్ల సత్తయ్య, పేర్ల వెంకటేశ్వర్లు,దూసరి మధు, ఈగల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love