Thursday, June 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాణ్యమైన విత్తనం.. రైతన్నకు నేస్తం.!

నాణ్యమైన విత్తనం.. రైతన్నకు నేస్తం.!

- Advertisement -

మండల వ్యవసాయ అధికారి శ్రీజ
నవతెలంగాణ – మల్హర్ రావు
: నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తమని మండల వ్యవసాయ అధికారి శ్రీజ అన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘నాణ్యమైన విత్తనం – రైతన్న కు నేస్తం’లో భాగంగ మంగళవారం రోజున ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ లో తయారు చేయబడిన వరి, పెసర విత్తనాలను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు.డబ్ల్యూజిఎల్ 962 (డబ్ల్యూజిఎల్ -962) రకం వరి విత్తనాలు 10 కేజీల బ్యాగ్ 50/- రూపాయలు అదే విధంగా ఏంజిజి385 ( MGG-385) పెసర విత్తనాలు 3 కేజీల బ్యాగ్ 50/- రూపాయల కు గాను ప్రతీ రెవిన్యూ గ్రామానికి రెండు వరి విత్తనాల బ్యాగ్ లు, పెసర విత్తనాలు ఒక బ్యాగ్ చొప్పున మండలం లోని 18 రెవిన్యూ గ్రామాలకు గాను 36 వరి విత్తనాల బ్యాగ్ లు,18 పెసర విత్తన బ్యాగ్ లు  అందుబాటులో ఉన్నా విత్తనాలను రైతులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో విస్తరణ అధికారులు పృథ్వి, శిరీష, అనూష, ఆయా గ్రామల రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -