Friday, June 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాణ్యమైన విత్తనాలు రైతులకు నేస్తం 

నాణ్యమైన విత్తనాలు రైతులకు నేస్తం 

- Advertisement -
  • – మార్కెట్ యార్డు చైర్మన్ హరలింగం 
    నవతెలంగాణ – నవాబు పేట

    నాణ్యమైన విత్తనాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని మార్కెట్ యార్డు చైర్మన్ హరలింగం వ్యవసాయ శాస్త్రవేత్త రాధిక అన్నారు. మంగళవారం మండల కేంద్రము లోని రైతు వేధికలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం ద్వారా వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానం నుండి తయారు చేయబడిన వరి పచ్చజొన్న కంది రకాలను ప్రతి ఒక్క రెవెన్యూ గ్రామంలో ఒక్కరూ చొప్పున అభ్యుదయ రైతులను గుర్తించి వారికి నాణ్యమైన విత్తనాలు అందజేశారు.రైతులు నాణ్యమైన వరి పచ్చ జొన్న, కంది విత్తనాలను ఎంపిక చేసుకొని అధిక దిగుబడులు సాధించాలని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సీనియర్ శాస్త్రవేత్త రాధిక సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్ మండల వ్యవసాయ అధికారి కృష్ణ కిషోర్ మండల అధ్యక్షుడు రాంచంద్రయ్య నవాజ్ రెడ్డి మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ తులసి రాం నాయక్ ఏఈఓ లు బి ఆనంద్ ఎం ఆనంద్ మౌనిక కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీహరి గోపాల్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -