- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మార్చి 2న తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై కీలక సూచనలు ఇవ్వనున్నట్లు సమాచారం.
- Advertisement -



