నవతెలంగాణ – జన్నారం: మండలంలో బావి భారత ప్రధాని, అమేది పార్లమెంటు సభ్యులు, భారతదేశ దిక్సూచి యువ నాయకులు, రాహుల్ గాంధీ జన్మదినాన్ని గురువారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కేకు కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం మిఠాయిలు పంచుకున్నారు. మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజాఫర్ ఏఎంసీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భారతదేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అవతారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల అమలుకు రాహుల్ గాంధీ కృషి ఎంతో ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు ,తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES