నవతెలంగాణ – కంఠేశ్వర్ : కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు ఎంపీ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్ లో ఆయన జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కి 55 వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ నిరంతరం దేశ అభివృద్ధి వైపు చూసే వ్యక్తి అని, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ప్రజలతో మాట్లాడి ప్రజల సమస్యలు తెలుసుకున్న నాయకుడని వారు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని, రాహుల్ గాంధీ ఆశయాలను ఆలోచన విధానాలను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకు వెళుతుందని, రాహుల్ గాంధీ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నామని ,త్వరలోనే రాహుల్ గాంధీ ని ప్రధానిగా చేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి,జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి,నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్,మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గోపి,జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ధర్మ గౌడ్, డిసిసి డెలిగేట్ ప్రమోద్,మహిళా అధ్యక్షురాలు రేవతి, ఎస్సీ సెల్ అధ్యక్షులు వినయ్,సంగెం సాయిలు,నరేంద్ర సింగ్,ప్రవీణ్, సాయి కుమార్,మలైకా బేగం,పుప్పాల విజయ,ముశ్షు పటేల్ తదితరులు పాల్గొన్నారు
ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES