- Advertisement -
నవతెలంగాణ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీలను ఆహ్వానించారు.
ఈ సందర్భంగా భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి, ఆదాయ వృద్ధి లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ గురించి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు సీఎం వివరించి.. ఆహ్వాన పత్రికను అందించారు. సీఎంతో పాటు ఎంపీలు, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఉన్నారు.
- Advertisement -



