పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు బలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె.నాగరత్న ప్రకటించారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. 24న వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చు. 25న ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.
26, 27 తేదీల్లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఆ రెండు రోజుల్లో మిగతా జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే సూచనలుండటంతో ఆ జిల్లాలకు ఎల్లో హెచ్చరికను విడుదల చేసింది. గ్రేటర్ హైదరాబాద్లో వచ్చే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశముంది. రాష్ట్రంలో మంగళవారం రాత్రి పది గంటల వరకు రాష్ట్రంలో 360 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా బైంసా మండలం వనల్పహాడ్లో 7.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
వచ్చే ఐదురోజులు వర్షాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES