- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, మహబూబ్నగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఈదురుగాలులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది.
- Advertisement -