- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కుస్తాయని తెలిపింది. మూడు రోజుల తర్వాత మళ్లీ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరగొచ్చని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
- Advertisement -



