నవతెలంగాణ హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొత్త గోశాలలు నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నందుకు సీఎం రేవంత్రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ధన్యవాదాలు తెలిపారు.
‘‘మోడల్ గోశాలలు నిర్మించే నిర్ణయం చాలా మంచిది. గో రక్షణ గురించి ఒక స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేయండి. అందులో నన్ను కూడా సభ్యుడిగా నియమించండి. దేశంలోని ముఖ్యమంత్రులందరిలో గోవులకు సేవ చేసే నిజమైన ముఖ్యమంత్రి ఎవరు అని అడిగితే గుర్తుకు వచ్చే రెండో పేరు మీదే. మొదటి పేరు యోగి ఆదిత్యనాథ్, రెండో పేరు రేవంత్ రెడ్డి. ఇలాంటి పనులు చేస్తే మీకు దేశంలో మంచి గుర్తింపు వస్తుంది. తెలంగాణలో గోవధను నిషేధించాలి’’ అని రాజాసింగ్ కోరారు. వేల సంఖ్యలో ఆవులు, దూడలు, ఎద్దులను కబేళాల్లో అక్రమంగా చంపుతున్నారని రాజాసింగ్ ఆరోపించారు. దీన్ని నివారించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కోరారు.