- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : టేకుమట్ల మండలంలోని వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల రవి అలియాసిస్ గణేష్ ఇటీవల బారి ఎన్ కౌoటర్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే. శనివారం భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అయిత రాజిరెడ్డి రవి సంస్మరణ సభకు హాజరై నివాళులర్పించారు. రవి సోదరుడైన టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ ను పరామర్శించారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కటకం శ్రీనివాస్,పావిరాల లక్ష్మన్ పాల్గొన్నారు.
- Advertisement -