నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో బుధవారం స్వర్గీయ మాజీ భారత ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సంకేట రవి ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధానిగా రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం రాజీవ్ గాంధీ కన్న కలలను నిజం చేస్తుందన్నారు.కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలన్నారు. కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, పట్టణ అధ్యక్షులు నిమ్మ రాజేంద్రప్రసాద్, నాయకులు బుచ్చి మల్లయ్య, సల్లూరి గణేష్ గౌడ్, సుంకేట శ్రీనివాస్, వేములవాడ జగదీష్, దూలూరి కిషన్ గౌడ్, సాయి కుమార్ గుప్తా, నరేందర్, అజరుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
కమ్మర్ పల్లిలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES