- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని విజ్ఞాన జ్యోతి ఉన్నత పాఠశాలలో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఒకరినొకరు రాఖీలు కట్టుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గుండోజి రవీందర్ మాట్లాడుతూ రక్షాబంధన్ పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. రాఖీ పండుగ సోదరీ సోదరుల ప్రేమానురాగాలకు ప్రతీక అని, రక్షాబంధన్ పండుగను ప్రజలంతా ఆనందోత్సవాలతో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సౌమ్య, ఉపాధ్యాయ బృందం సభ్యులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -