నవతెలంగాణ – ఆర్మూర్ : సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా ఆధ్వర్యంలో అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని సోమవారం సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పందా కార్యాలయం నుండి తహసిల్దారు ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించినారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా సబ్ డివిజన్ కార్యదర్శి బి కిషన్ మాట్లాడుతూ.. బి ఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఖాళీ స్థలం ఇల్లు లేనటువంటి వారి కోసం డబుల్ బెడ్ రూమ్ లను కట్టడం జరిగింది. వీటికి సంబంధించి గతంలోనే అప్లికేషన్లు తీసుకోగా అర్హులను కూడా గుర్తించడం జరిగింది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత లీడర్లు మారడమే కాదు.. అర్హులను కూడా ఆ లీడర్లు మార్చారని వారు అన్నారు.
మండలంలోని అంకాపూర్ గ్రామంలో 81 మంది అర్హులను గుర్తించిన గత ప్రభుత్వాధికారులు అందులో నుంచి కొంత మందిని తొలగించి ఎమ్మెల్యే అనుచరుల పేర్లు చేర్చుకోవడం జరిగింది అని అన్నారు. పట్టణం లోని పోచమ్మ గల్లీలో 150 మంది అప్రూవల్ పొందిన లిస్టును కూడా మార్చడం జరిగింది. ఇవన్నీ కూడా అధికారులు సమగ్ర విచారణ చేపట్టి పంపిణీ చేయాలని వారి డిమాండ్ చేశారు. అలాగే స్థలం ఉండి ఇండ్లు లేనటువంటి వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఇల్లు పేరు మీద ఐదు లక్షలు మంజూరు చేయడం జరుగుతుందో పూర్తి విచారణ చేపట్టి అర్హులకు ఇవ్వాలని స్థానికంగా ఉన్న నాయకుల పాత్ర లేకుండా చూడాలని వారు కోరారు . కేంద్ర ప్రభుత్వం కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని రేషన్ షాపుల ద్వారా అర్హులందరికీ పప్పు గోధుమలు, కారం ఉప్పు పసుపు లాంటి నిత్యవసర సరుకులు అందించాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల్ని రోడ్లపైకి తీసుకువచ్చే కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ నాయకులు ఎండి నజీర్ .రవి , పి రవి ,నిఖిల్, సాయమ్మ ,సరూప, సాయిలు నవీన్ ,వేణు ,తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన వారికే డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని ర్యాలీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES