- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి : బతుకుతెరువు కోసం దుబాయ్ వలస వెళ్లిన గల్ఫ్ కార్మికుడు మృతి చెందడం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మండలంలోని గోకుల్ తాండాకు చెందిన మాలోత్ భాస్కర్ ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో దుబాయ్ కి వలస కార్మికులుగా గత 10 నెలల క్రితం వెళ్లారు. అయితే పనిరీత్యా అక్కడ అనారోగ్యం పాలయ్యాడు. పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు మిత్రుల ద్వారా కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. దీంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృత దేహాన్ని త్వరగా గ్రామానికి తీసుకువచ్చేలా కృషి చేయాలని ప్రభుత్వాన్ని, రాజకీయనాయకులను గ్రామస్తులు కోరుతున్నారు.
- Advertisement -