– భారత పౌరుడు కాదన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో నిర్ణయం
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్బాబు పేరు ఓటర్ జాబితా నుంచి తొలగించడానికి రెవెన్యూ శాఖ చర్యలు ప్రారంభించింది. ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పు మేరకు, చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గురువారం వేములవాడలోని ఆయన నివాసానికి రెవెన్యూ అధికారులు ఫారమ్ 7 ప్రకారం నోటీసు అందజేశారు. రిజిస్ట్రార్ పోస్టు ద్వారా పంపిన ఈ నోటీసులో, ఓటర్ జాబితా నుంచి ఆయన పేరు తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు. పేరు తొలగింపుపై రమేష్బాబుకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే, జులై 2వ తేదీ లోగా సమాధానం ఇవ్వాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ నోటీసులు తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల మేరకు.. ఎన్నికల శాఖ ఆదేశాలతోనే జారీ చేసినట్టు రెవెన్యూ శాఖ వెల్లడించింది. అయితే, ఇంతవరకూ చెన్నమనేని రమేష్బాబు దీనిపై స్పందించలేదు.
ఓటర్ లిస్ట్ నుంచి చెన్నమనేని రమేష్బాబు పేరు తొలగింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES