విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రానికి ‘రణబాలి’ అనే టైటిల్ను ఖరారు చేశారు. టైటిల్ గ్లింప్స్ విడుదలతో పాటు సినిమా రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్కు రానుంది. ఈ సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
ఈ సినిమా గ్లింప్స్లో రణబాలి అనే యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది. తన మాతభూమి కోసం ప్రాణాలు ఒడ్డి పోరాడే రణబాలి పాత్రలో విజరు ఒదిగిపోయారు. హీరోయిన్ రష్మిక మందన్న జయమ్మగా కనిపించింది. ప్రతినాయకుడు సర్ థియోడోర్ హెక్టార్ పాత్రలో ‘మమ్మీ’ సినిమా ఫేమ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ నటించారు.
పచ్చటి పైరులతో అలరారే మన గ్రామసీమలను బ్రిటీష్ క్రూర పాలకులు కరువు ప్రాంతాలుగా ఎలా మార్చారో ఈ గ్లింప్స్లో బాధాకరంగా చూపించారు. ఆర్థికంగా పీల్చిపిప్పి చేస్తూ మన సమాజంలో హిట్లర్ ఊచకోతను మించిన మారణహోమాన్ని బ్రిటీషర్స్ ఎలా సష్టించారో గ్లింప్స్ రిఫ్లెక్ట్ చేసింది. బ్రిటీష్ అధికారిని గుర్రానికి కట్టి రైల్వే ట్రాక్ పై రణబాలి ఈడ్చుకుంటూ వెళ్లే సీన్ గ్లింప్స్కు హైలైట్ గా నిలుస్తోంది.19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్గా ఈ సినిమా రూపొందుతోంది. ‘డియర్ కామ్రేడ్’, ‘ఖుషి’ వంటి సక్సెస్ఫుల్ సినిమాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, విజరు కలిసి చేస్తున్న మూడో చిత్రమిది.
‘రణబాలి’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



