- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన యోగ నిపుణురాలికి మలేషియాలో అరుదైన అవార్డు దక్కింది. నిత్యం యోగాతోనే ధ్యానం మొదలు పెడుతూ యోగా ద్వారానే సంపూర్ణ ఆరోగ్యాలు వరిస్తాయని జిల్లాలో పలు ప్రదర్శనలో అత్యుత్తమ ప్రతిభ చాటిన యోగా నిపుణురాలు నాచుర పెటిస్ట్, యోగా తెరపిస్ట్ ఐశ్వర్య కాలే విదేశాల్లో సైతం అవార్డు దక్కించుకుంది. మలేషియాలోని కౌలాలంపూర్లో అక్కడి మన తెలుగు మన వెలుగు వారు నిర్వహించిన పోటీలో ఐశ్వర్య కాలే ఈ అవార్డు దక్కినట్లు ఆమె సోషల్ మీడియాలో తెలిపారు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఎంత ఒత్తిడిలోనైనా ఉదయం అరగంట యోగాకు కేటాయిస్తే ఏ రోగాలు దరికి చేరవని ఆమె అన్నారు.
- Advertisement -