- Advertisement -
నవతెలంగాణ – సిద్దిపేట
కొత్తగా రేషన్ కార్డులు వచ్చినవారికి పంపిణీ చేయడానికి సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయానికి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకుల మధ్య మంత్రి, అధికారుల ముందే ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటూ, నినాదాలు చేస్తూ గొడవకు దిగారు. మంత్రి ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడగానే బిఆర్ఎస్ నాయకులు అందరికీ రాలేదని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ సభకు ఎందుకు రాలేదని కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. హరీష్ రావు వల్లనే లొల్లి అవుతుందని నినాదాలు చేశారు.
- Advertisement -