- Advertisement -
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని దిగ్గజ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) నూతన మేనేజింగ్ డైరెక్టర్గా రత్నాకర్ పట్నాయక్ బాధ్యతలను స్వీకరించారు. 1968లో జన్మించిన ఆయన ఎల్ఐసీలో 1990లో డైరెక్ట్ రిక్రూట్ ఆఫీసర్గా కేరీర్ను ప్రారంభించారు. ఆ తర్వాత వివిధ హోదాల్లో పని చేసిన రత్నాకర్ ఎండీ కాకముందు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. గడిచిన 35 ఏండ్లలో దేశంలోని అన్ని భౌగోళిక ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పని చేసిన అనుభవం ఉంది.
- Advertisement -