నవతెలంగాణ హైదరాబాద్: కొండాపూర్లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నరన్న పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ నిర్వహించారు. రేవ్ పార్టీలో పాల్గొన్న 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేయడంతో పాటు 6 కార్లు, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సోదాల్లో 2 కిలోల గంజాయి, 50 గ్రాముల ఓజీ కుష్డ్రగ్, 11.57 గ్రాముల మ్యాజిక్ మష్రుమ్, 1.91 గ్రాముల చెరాస్ డగ్స్ లభ్యమయ్యాయి.
నిందితులను శేరిలింగపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయవాడకు చెందిన వాసు, శివంరాయుడు రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఇందుకోసం వారు ఇతరుల గుర్తింపు కార్డులు వాడుతున్నట్టు దర్యాప్తులో తేలింది.