- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ థియేటర్ బిజినెస్లోకి అడుగుపెట్టారు. ఏషియన్ సినిమాస్తో కలిసి హైదరాబాద్లోని వనస్థలిపురంలో ఆరు స్క్రీన్లతో లగ్జరీ మల్టీఫ్లెక్స్ ‘ART’ థియేటర్ను నిర్మించారు. జులై 31న దీని ప్రారంభోత్సవం జరగనుండగా, తొలి సినిమాగా కింగ్డమ్ మూవీని ప్రదర్శించనున్నారు. 60 అడుగుల స్క్రీన్, డాల్బీ అట్మాస్ సౌండ్తో ఈ మల్టీఫ్లెక్స్ ఈస్ట్ హైదరాబాద్లో అత్యుత్తమ సినిమాటిక్ అనుభవం అందించనుంది.
- Advertisement -