Thursday, June 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆర్‌అండ్‌బీ అధికారులు అప్రమత్తంగా ఉండాలి

ఆర్‌అండ్‌బీ అధికారులు అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఆర్‌అండ్‌బీ అధికారులు క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లో ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గత అనుభవాల దృష్ట్యా వర్షాకాలంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా హెడ్‌ క్వార్టర్‌లో అందుబాటులో ఉంటూ క్షేత్ర స్థాయిలో రోజువారీ పర్యవేక్షణ చేయాలని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో చీఫ్‌ ఇంజనీర్లు, జిల్లాల్లో సూపరింటెండెంట్‌ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, క్షేత్ర స్థాయి ఇంజనీర్లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ భారీ వర్షాలు, వరదల వల్ల రోడ్ల కనెక్టివిటీకి ఎక్కడా ఇబ్బంది రాకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. వరదల వల్ల డ్యామేజ్‌ అయిన రోడ్లు వెంటనే రీ స్టోర్‌ చేసేందుకు వీలుగా ఇసుక బస్తాలు, సిమెంట్‌ బస్తాలు ఏ.ఈ స్థాయిలో అందుబాటులో ఉండే ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉధృృతంగా ప్రవహించే నదులు, వాగుల వద్ద బ్రిడ్జిలు, కల్వర్టులపై ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలనీ, అందుకు అనుగుణంగా జిల్లా స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌ సెంటర్లు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రధాన కార్యాలయ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేయాలని సూచించారు. వెంటనే సమస్య పరిష్కారం అయ్యేలా రాష్ట్ర స్థాయిలో అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గతంలో ఏర్పడిన గుంతల రోడ్లు పూడ్చేందుకు ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టామనీ, ఇంకా పెండింగ్‌లో ఉన్న రోడ్డు ప్యాచ్‌ వర్క్‌లపై అధికారులను ఆరా తీశారు. దినపత్రికల్లో వచ్చిన వార్తా కథనాల అంశాల్ని ప్రస్తావించి ఆయా రోడ్ల పరిస్థితి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌ అండ్‌ బి స్టేట్‌ రోడ్స్‌కు సంబంధించి మొత్తం 1,214 గుంతలు ఏర్పడి 2,488 కి.మీ రోడ్డు పాక్షికంగా దెబ్బతిన్నాయనీ, 2,186 కి.మీ రోడ్డు మరమ్మతులు పూర్తయ్యాయనీ, ఇంకా 302 కి.మీ మరమ్మతులు కొనసాగుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. మిగిలిన రోడ్ల ప్యాచ్‌ వర్క్‌లు వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రోడ్లు, భవనాల శాఖపై ప్రత్యేక బాధ్యతలు ఉంచారనీ, రాష్ట్ర మౌలిక అవసరాల అభివద్ధిలో రోడ్లు భవనాలు శాఖ గేమ్‌ ఛేేంజర్‌ రోల్‌ పోషిస్తున్న నేపథ్యంలో త్వరలో ఆర్‌ అండ్‌బీ శాఖకు సంబంధించి రాష్ట్ర స్థాయి సమీక్ష నిర్వహిస్తామనీ, అధికారులు పూర్తి వివరాలతో సన్నద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -