బాధితులు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి పోగొట్టుకున్న ఫోన్లు పొందవచ్చు
ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ వెల్లడి..
నవతెలంగాణ – కామారెడ్డి: సెల్ ఫోన్ పోయినా.. చోరీకి గురైనా.. ఆందోళన చెందవద్దని, సిఈఐఆర్ఎఫ్ ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ శుక్రవారం అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లాలో వివిధ చోట్ల పోగొట్టుకున్న, చోరికి గురైన 130 మొబైల్ ఫోన్లను ( సుమారు రూ.20 లక్షల విలువగల) స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించడం జరుగుతుంది అని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఇది వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. మొబైల్ పోయిన లేదా చోరీకి గురైన వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్ కు వెళ్ళి దరఖాస్తు ఇవ్వాలనీ, సిమ్ కార్డ్ బ్లాక్ చేసి అదే నంబరు గల కొత్త సిమ్ తీసుకోవాలి. తద్వారా పోయిన మొబైల్ ఫోన్ల ఐఎంఈఐ వివరాలు సిఈఐఆర్ వెబ్సైట్ లో బ్లాక్ చేయడం వలన పోగొట్టుకున్న మొబైల్ సులబంగా దొరికే అవకాశం ఉన్నదన్నారు. జిల్లా పోలీసు కార్యాలయములో పోయిన సెల్ ఫోన్ల రికవరీ కోసం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఒక ఆర్ఎస్ఐ , 10 మంది కానిస్టేబుల్స్ తో ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరగిందని అన్నారు. గత (3) రోజులలో ఈ టీం అధికారులు 130 ఫోన్ లను రికవరీ చేయడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా 130 మొబైల్ ఫోన్ల రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన టీం సభ్యుల అందరినీ జిల్లా ఎస్పీ అభినందించడం జరిగింది. ఇప్పటి వరకు రికవరీ చేసిన ఫోన్ల వివరాలను బాధితులకు తెలిజేయడం జరుగుతుంది. వారు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఆర్ ఎస్ ఐ బాలరాజ్ ని సంప్రదించి (8712686114) ఫోన్ కు సంభంధించిన వివరాలు చూపించి తమ తమ ఫోన్లను తీసుకోవాలన్నారు.
130 మొబైల్ ఫోన్ల రికవరీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES