నవతెలంగాణ – పరకాల : రెడ్ క్రాస్ సొసైటీ తన సేవలను విస్తృతపరచాల్సిన అవసరముందని ఎంపి.కడియం కావ్య రెడ్ క్రాస్ సొసైటీ పాలక వర్గానికి సూచించారు. పరకాల పాత పోస్టుమార్టం స్థలంలో రెడ్ క్రాస్ సొసైటీ భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎంపి.కడియం కావ్య, కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానుద్దేశించి ఎంపి మాట్లాడుతూ ..వృత్తి రీత్యా డాక్టరైన నాకు రక్తం యొక్క ప్రాధాన్యత ఎంత విలువైందో తెలుసన్నారు. తాను వర్ధన్నపేట ఆస్పత్రిలో పనిచేస్తున్న సమయంలో గర్బిణీ స్త్రీలకు సర్జరీకి ముందు అప్పటికప్పుడు బ్లెడ్ అవసరం పడితే లెటర్ రాసి తెప్పించాల్సి వచ్చేదన్నారు. అక్కడికి రెడ్ క్రాస్ సొసైటీ దూరం కావడంవల్ల జాప్యం జరుతుండేడిదన్నారు. ఈ క్రమంలో ఇటీవల గవర్నర్ ప్రతి జిల్లాలో ఒక్క రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పర్చాలనే నిర్ణయం ఆహ్వానించదగిన పరిణామమన్నారు. దీంతో రెడ్ క్రాస్ సొసైటీ అత్యవసర సమయాల్లో బాదితులకు సకాలంలో రక్తం అందుతుందన్నారు. అంతే కాకుండా రెడ్ క్రాస్ సొసైటీ గర్భిణీ స్త్రీలకు, కౌమార దశలోని బాలికలకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించి హెచ్ బీ శాతం గుర్తించాలని, అందుకు అనుగుణంగా ఐరన్ తదితర ఇతరత్రా మాత్రలు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నాటు సారా, లిక్కర్, డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంంతో పాటు డ్రగ్ డి అడిక్సన్ సెంటర్ల నిర్వహణ ప్రత్యామ్నాయ వర్గాల వైపు వారిని చైతన్యం చేసే విధంగా రెడ్ క్రాస్ సొసైటీ తన సేవలను విస్కృతపరచాలని ఎంపీ కావ్య సూచించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఇవి శ్రీనివాస్,పాలక మండలి సభ్యులు పాపి రెడ్డి, డాక్టర్ సంద్య,పుల్లూరి వేణు, డాక్టర్ శేషు మాధవ్,బిల్ల రమణారెడ్డి,సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చౌహాన్, ఆర్డీవో డాక్టర్ నారాయణ, మున్సిపల్ ఇంచార్జీ కమిషనర్ కె సుష్మ, తహసిల్దార్ విజయలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, టౌన్ అద్యక్షులు కొయ్యడ శ్రీనివాస్, బిజేపి అద్యక్షులు గాజుల నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
రెడ్ క్రాస్ సేవలను విస్తరించాలి: ఎంపీ. కడియం కావ్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES