Wednesday, June 18, 2025
E-PAPER
Homeఖమ్మంప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి.. మానవాళిని కాపాడండి: ఏడీ హేమంత కుమార్ 

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి.. మానవాళిని కాపాడండి: ఏడీ హేమంత కుమార్ 

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక వ్యవసాయ కళాశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రి ఆర్.ఎం.ఓ డాక్టర్. బి. విజయకుమార్ అతిథిగా హాజరు అయ్యారు.  కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జే. హేమంత కుమార్ అధ్యక్షతన కళాశాల  బోధన,బోధనేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం అదేవిధంగా ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని వివరించడం వివరించారు.ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయంగా వినియోగించ వలసిన పేపర్ బ్యాగులు,జ్యూట్ బ్యాగులు,అదేవిధంగా వ్యవసాయ రంగంలో ప్లాస్టిక్ వినియోగం వల్ల జరుగుతున్న అనర్ధాలు వాటిని తగ్గించడానికి చేపట్టవలసిన చర్యలు గురించి విద్యార్థులకు వివరించారు.డాక్టర్ విజయ్ కుమార్ ప్లాస్టిక్ పదార్థాలు వినియోగించడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు వాటికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించ వలసిన వస్తువుల గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ రాంప్రసాద్, డాక్టర్ మధుసూదన్ రెడ్డి,డాక్టర్ కోటేశ్వర్, డాక్టర్ నీలిమ, డాక్టర్  పావని, డాక్టర్ రమేష్, డాక్టర్ ఝాన్సీ రాణి, డాక్టర్ నాగాంజలి, డాక్టర్ శిరీష పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -