విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కు తున్న పాన్ ఇండియా సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్లో షురూ అయ్యింది.
ప్రస్తుతం విజరు సేతుపతి, సంయుక్త, ఇతర తారాగణం పాల్గొనే కీలక సన్నివేశాలను ఓ భారీ సెట్లో చిత్రీకరిస్తున్నారు. ఎలాంటి బ్రేక్స్ లేకుండా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రతి అంశంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా విజయ్ సేతుపతిని గతంలో చూడని సరికొత్త స్టయిల్లో చూపించబోతున్నారు. ఈసినిమాలోని విజయ్ సేతుపతి పాత్ర అందర్నీ సర్ప్రైజ్ చేస్తుంది అని చిత్ర బృందం తెలిపింది.
టబు, విజరు కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ట్రూ పాన్-ఇండియా ఎంటర్టైనర్గా పూరి, సేతుపతి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే లక్ష్యంతో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం,హిందీ ఐదు భాషలలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్ను జెబి మోషన్ పిక్చర్స్ జెబి నారాయణ్ రావు కొండ్రోల్లాతో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పిస్తున్నారు.
రెగ్యులర్ షూటింగ్ షురూ..
- Advertisement -
- Advertisement -