నవతెలంగాణ హైదరాబాద్: నేపాల్లో చోటుచేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో పలువురు తెలంగాణ వాసులు అక్కడ ఉన్నారు. వారికి సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ముగ్గురు అధికారుల బృందానికి బాధ్యతలు అప్పగించింది.
ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు నేపాల్లో తెలంగాణ పౌరులెవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కాఠ్మాండూలోని భారత రాయబార కార్యాలయంతో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ పౌరులు, వారి కుటుంబ సభ్యులు అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోవద్దని సూచించింది.
నేపాల్లో ఎవరైనా తెలంగాణ వాసులు ఇబ్బందులు పడుతుంటే వారి కుటుంబ సభ్యులు ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులను ఈ కింది నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు. వందన, రెసిడెంట్ కమిషనర్ ప్రయివేట్ సెక్రెటరీ & లైజన్ హెడ్ +91 9871999044, జి.రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్ +91 9643723157, సీహెచ్ చక్రవర్తి, ప్రజా సంబంధాల అధికారి +91 9949351270.