- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ గ్రామపంచాయతీలోని 3వ వార్డులో మురికి కాల్వలు చెత్తా, చెదారంతో నిండిపోయి దుర్వాసన వేదజల్లుతొంది. దీంతో వార్డు ప్రజలు గ్రామ పంచాయతీకి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఉప సర్పంచ్ లకావత్ సవేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం పంచాయతీ సిబ్బందితో డ్రైనేజీలో చెత్త, చెదారం తొలగించి పరిశుభ్రం చేయించారు. అలాగే రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి, విద్యుత్ సమస్యను పరిస్కారం చేయించారు. దీంతో వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -



