Friday, January 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా రేణుక ఎల్లమ్మ దేవి కళ్యాణ మహోత్సవం

ఘనంగా రేణుక ఎల్లమ్మ దేవి కళ్యాణ మహోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
శ్రీ సాయి రేణుకా మాత దేవాలయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి – జమదగ్ని మహర్షుల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించబడింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తుమ్మల పద్మలక్ష్మమ్మ రెడ్డి, హేమాళ్ల అరుణ – ఉపేందర్ రెడ్డి దంపతులు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు లక్కవజ్జుల సుబ్రమణ్యం శాస్త్రి సిద్ధాంతి,పాండు రంగ శాస్త్రి సిద్ధాంతి, శ్రీనుపంతులు వేదమంత్రోచ్ఛారణలతో కళ్యాణాన్ని నిర్వహించారు.

ఆలయ అర్చకులు రవి పాండే  పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు వాసం సత్యం, అధ్యక్షులు గాదె సోమి రెడ్డి, ప్రధాన కార్యదర్శి అంకం రాజయ్య, కోశాధికారి అంకం రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాసమల్ల కొండల్, సహాయ కార్యదర్శి రాజబోయిన కొండల్‌తో పాటు అంకం శ్రీను, కాటమ సాయిలు, మామిడల నర్సింహులు, దోర్నాల వెంకన్న, బండారి సాయి కల్యాణం, సాయిరాం, బండారి మల్లేష్ కల్యాణం, నారాయణ, అంకం రఘు, రాసమల్ల రేవంత్, బాదిని సాగర్ తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దేవీ–దేవుల కళ్యాణాన్ని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ముగిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -