- Advertisement -
- – యూనిఫామ్, పుస్తకాలు పంపిణీ చేసిన డీఈవో ప్రాణిని
నవతెలంగాణ -తాడ్వాయి - మండలంలో ప్రభుత్వ పాఠశాలలు గురువారం ఒక పండుగలా పునః ప్రారంభమయ్యాయి. ఇందిరానగర్ జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల, కస్తూరిబా (కేజీబీవీ) పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని మండల విద్యాశాఖ అధికారి రేగ కేశవరావు తో కలిసి విద్యార్థినీ, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, యూనిఫామ్ దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ సర్కార్ పాఠశాలల్లో బడి శుభ్రత, భోజనంలో నాణ్యత పై ప్రభుత్వం దృష్టి సారించింది అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అర్హత అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయడం జరుగుతుందని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు చేర్పించాలని తెలిపారు. అనంతరం మండల విద్యాశాఖ కార్యాలయాన్ని తనకి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రేగ కేశవరావు, కేజీబీవీ ప్రిన్సిపాల్ ఇర్ప పుష్పా, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -